Posts

Showing posts from August, 2025

దళితులు పట్టణాలకు తరలాలి - –డా.పసునూరి రవీందర్

  మార్జినల్ వాయిస్ - 10 ఇవాళ్టి తెలుగుప్రభ దినపత్రికలో నా వీక్లీ కాలమ్. //దళితులు పట్టణాలకు తరలాలి// ‘‘యువత గ్రామాలకు తరలండి’’ అనే పిలుపుకు తెలుగునాట చాలా చరిత్ర ఉంది. ఆ పిలుపుకు ఆకర్షితులయ్యి యువత పెద్దమొత్తంలో అడవిబాట పట్టారు. ఆ క్రమంలోనే అకాల మరణాల పాలై, తమను నమ్ముకున్న కుటుంబాలకు తీరని అన్యాయం చేశారు. మరోవైపు తాము అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో 90వ దశకం తరువాత తెలుగునాట దళిత చైనత్యం ఎంతో పెరిగింది. చదువుకున్న యువత కారంచేడు,చుండూరు ఘటనల నేపథ్యంలో కులవ్యవస్థను గురించి తీవ్రంగా ఆలోచించింది. మన విముక్తి చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని అందుకు అంబేద్కర్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. అప్పటికీ విప్లవోద్యమంలో పని చేసిన దళితులకు అంబేద్కర్ కంటే మార్క్స్, మావోలే ఎక్కువ చేరువయ్యారు. అందుకు కారణం ఆ పార్టీల్లోని ఆధిపత్యకులాలకు చెందిన నాయకులే. వారే దళితులకు అంబేద్కర్ను అందకుండా చేసి, ఆయనను ఒక బూర్జువాగా ప్రచారం చేశారు. కేవలం బ్రిటీష్ పాలకులకు మెమోరాండాలు ఇచ్చిన నేతగా మాత్రమే చూశారు. అట్లా సదరు ఓసీ నాయకులు అంబేద్కర్ రచనలను గాని, ఆయన ఆలోచనలను గాని తెలుసుకోలేకపోయారు. ఇది దశాబ...

Opposition MPs Protest Against Voter List

Image
  Opposition MPs Protest Against Voter List: కదం తొక్కిన విపక్షం ABN  , Publish Date - Aug 12 , 2025 | 04:04 AM ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కదం తొక్కారు. బిహార్‌లో ఓటర్ల ఓట్ల చోరీ, ఎస్‌ఐఆర్‌పై 300 మంది ఎంపీల నిరసన పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి.. ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్న లోక్‌సభ, రాజ్యసభ విపక్ష ఎంపీలు మధ్యలోనే అడ్డుకుని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు పోలీసులతో వాగ్వాదం.. తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత రాహుల్‌, ఖర్గే, ప్రియాంక సహా పలువురు నేతల అరెసు న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):  ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కదం తొక్కారు. బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ.. సోమవారం నిరసన చేపట్టారు. పార్లమెంట్‌ భవనం నుంచి ఈసీ కార్యాలయం దాకా ఎంపీలు ప్రదర్శన చేపట్టగా.. వారిని ఢిల్లీ పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకొని నిర్బంధించా...

Electoral Roll Revision Controversy (AP)

           Gutta Rohit                2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు అని కొంతమంది లబలబలాడిపోతున్నారు. ముందుగా రాజకీయ కారణాలు చెప్పుకోవచ్చు.            మహారాష్ట్ర, కర్ణాటక లో కాంగ్రెస్ ఒక ముఖ్య పార్టీ. అధికార/ప్రతిపక్ష స్థాయి పార్టీ. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో విపక్ష కూటమిలో ఒక పార్టీ. తమకి మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యం కాబట్టి వాటి గురించి తరుచూ మాట్లాడుతుంది. అలాగే ఉత్తర్ ప్రదేశ్ సమాజ్వాదీ పార్టీకి ముఖ్యం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. బీహార్ రాష్ట్రీయ జనతా దళ్, సిపిఐ (ఎం-ఎల్)(లిబరేషన్) పార్టీలకి ముఖ్యం కాబట్టి వాళ్ళు ఎస్ఐఆర్ మీద చాలా పని చేస్తున్నారు. ఈ లెక్కన ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడవలసింది ఎవరు? లబలబలాడుతున్నవారు ఈ ప్రశ్న వేసుకుంటే మంచిది.                ఇక రెండవది, మాట్లాడటానికి ఇక్కడ విషయం ఉందా? వాట్ డు నంబర్స్ హేవ్ టు సే? తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో పార్లమెంట్, శాసనసభ ఎ...

పీ 4 పిచ్చిలో చంద్రబాబు

Image
  Governance vs Grand Schemes: పీ 4 పిచ్చిలో చంద్రబాబు ABN  , Publish Date - Aug 10 , 2025 | 12:46 AM ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడూ నేల విడిచి సాము చేయాలని ఉబలాటపడుతుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యం కాని... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడూ నేల విడిచి సాము చేయాలని ఉబలాటపడుతుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్‌లో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు. దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఏ నాయకుడైనా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి గానీ, ప్రజలకు దూరమయ్యే సలహాలు, సూచనలు ఎవరు అందించినా పట్టించుకోకూడదు. జగన్‌రెడ్డి పాలనలో అష్టకష్టాలు పడి చివరకు జైలుకు కూడా వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి...

India on Path to Become Top3 Economy

Image
  India on Path to Become Top3 Economy: టాప్‌3 దిశగా భారత్‌ ABN  , Publish Date - Aug 11 , 2025 | 03:05 AM భారత ఆర్థిక వ్యవస్థను డెడ్‌ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన విమర్శలకు ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి ట్రంప్‌కు మోదీ పరోక్ష కౌంటర్‌ ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక భారత్‌ సాంకేతికత, మేకిన్‌ ఇండియా ప్రపంచంతో పోటీపడడమే కాదు.. నాయకత్వం కూడా వహించాలి: మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్‌-3కు శంకుస్థాపన.. ఎల్లో లైన్‌ సేవలు షురూ 3 వందేభారత్‌ రైళ్లు జాతికి అంకితం మెట్రోలో విద్యార్థులతో మోదీ ముచ్చట Pause Mute Remaining Time  - 10:00 Close Player బెంగళూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి):  భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్‌ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన విమర్శలకు ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలో టాప్‌-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందని కౌంటర్‌ ఇచ్చారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే స్ఫూర్తి నుంచి ఈ వేగం వచ్చిందన్నారు. స్పష్టమైన ఉద్దేశం, నిజాయితీ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చ...

Trump unable to tolerate the growth of India?

Image
  Home  »  National  »  Rajnath Singh Criticizes Trump, Highlights Indias Growing Power and Self reliance Rajnath Singh Criticizes Trump: భారత వృద్ధిని ఓర్వడం లేదు ABN  , Publish Date - Aug 11 , 2025 | 03:00 AM తామే అందరికీ బాస్‌ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను భారత్‌ సూపర్‌ పవర్‌గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శలు రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడి భోపాల్‌, ఆగస్టు 10:  తామే అందరికీ బాస్‌ అనుకునేవారు భారత వృద్ధిని ఓర్వడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా భారత్‌ సూపర్‌ పవర్‌గా మారడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైల్వే ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. ‘‘భారతదేశం అభివృద్ధి చెందుతుండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరికీ తాను బాస్‌ అనుకునేవారు.. భారత్‌ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని ఆశ్చర్య...